సిరిసిల్ల..సిరులఖిల్లా:హరీష్

215
harish
- Advertisement -

సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు అభివృద్దిలో పోటా పోటీగా ముందుకెళుతున్నాయని మంత్రి హరీష్ తెలిపారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించారు. ఆత్మహత్యల సిరిసిల్ల జిల్లాను సిరులఖిల్లాగా మార్చిన ఘనత కేటీఆర్‌దే అని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో కొనసాగిస్తున్నానని చెప్పారు. సిద్దిపేట అభివృద్ధి వెనుక 30 ఏండ్ల శ్రమ ఉందని…కానీ మంత్రి కేటీఆర్ నాలుగేండ్లలోనే సిరిసిల్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

రాష్ర్టానికి భారీ పెట్టుబడుల కోసం దేశవిదేశాల్లో పర్యటిస్తూనే, తన శాఖను సమర్థంగా నిర్వహించారని తాము అభివృద్ధిలో పోటీపడుతున్నట్టుగానే కార్యకర్తలు కూడా పోటీపడి ఓటింగ్‌శాతం పెరిగేలా కృషి చేయాలని కోరారు. ఒకవైపు కాళేశ్వరం నీళ్లు, మరోవైపు టెక్స్‌టైల్‌పార్క్ ద్వారా రానున్న రోజుల్లో సిరిసిల్ల పూర్తిగా అభివృద్ధి చెంది సిరులఖిల్లా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

- Advertisement -