TRS NRIలతో మంత్రి హ‌రీశ్‌రావు సమావేశం..

240
harish rao
- Advertisement -

ఆదివారం మంత్రి హ‌రీశ్‌రావు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. దుబ్బాకలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళిని వారికి వివ‌రించారు. ఈఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్ర‌పై దిశానిర్దేశం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎనలేని సుదీర్ఘ ప్రజా సేవలకు టీఆర్ఎస్ పార్టీ గౌరవాన్ని ఇస్తూ.. వారి సతీమణి సోలిపేట సుజాతకి కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రి హ‌రీశ్‌రావు ముమ్మ‌రంగా ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. ఉపఎన్నిక‌లు వ‌చ్చేనెల 3న జ‌ర‌గున్నాయి. వ‌చ్చేనెల 10న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ఈనెల 16తో నామినేష‌న్ల గ‌డువు ముగియ‌నుంది.

- Advertisement -