తెలంగాణలో పసిడి పంటలు పండుతున్నాయి- మంత్రి హరీష్‌

153
- Advertisement -

గురువారం సిద్దిపేటలో విపంచి ఆడిటోరియంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు జయంతి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. దాశరథి చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. నాడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.

అంతకుముందు దాశరథి పాటలు, ఆయన రాసిన కవిత్వం వింటుంటే అమృత ధారలు కురిసిన విధంగా మంచి అనుభూతి పొందినట్లు మంత్రి చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని, పీడిత ప్రజల పక్షాన పోరాడినట్లు చెప్పుకొచ్చారు. దాశరథి కలలుగన్న వారి ఊహాల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, జిల్లా లైబ్రరీని వినియోగించుకోవాలని మంత్రి కోరారు.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనే ఉద్యోగార్థులకై జిల్లా లైబ్రరీలో 50 కుర్చీలతో కూడిన వసతి కల్పించినట్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన పుస్తకాలు పెట్టాలని ఆయాచితం శ్రీధర్ కు మంత్రి సూచించారు. 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటరన్నారు. ఇప్పటి వరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన సంపూర్ణ సహకారం ఆర్థిక శాఖ తరపున అందిస్తానని భరోసా ఇచ్చారు.

https://twitter.com/TrsHarishNews/status/1418128043625705476
- Advertisement -