దుబ్బాక ఫలితంపై స్పందించిన మంత్రి హరీష్‌..

201
harish rao
- Advertisement -

దుబ్బాకలో ప్రజా తీర్పును శిరసా వహిస్తాం.. ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నా అంటు మంత్రి హరీష్ రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు.. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటాం.. మా లోపాలను సవరించు కుంటామన్నారు.

దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటు పడతాం అందుబాటులో ఉంటాం. ఓటమి అయినప్పటికీ దుబ్బాక ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో ఉంటామని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు, కార్యకర్తలకు, అన్నివిధాల సహాయ సహకారాలు ఇస్తూ, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -