కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌..

235
harish
- Advertisement -

సిద్ధిపేట జిల్లా దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్‌లో 315 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

  • మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :
  • – దేశంలోని 5 రాష్ట్రాలలో కాంగ్రెస్, 12 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికీ తాగునీరు, త్వరలోనే సాగునీరు, నిరుపేదలకు సంక్షేమం కింద ఆసరా ఫించన్లు, బీడీలు చుట్టే మహిళలకు బీడీ కార్మిక భృతి ఇస్తున్నది.
  • – తెలంగాణ వచ్చాక ఎక్కడ తాగునీటి సమస్య లేదు.
  • – తొలి కాన్పు తల్లిగారే చేయాలని ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
  • – రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద రైతుబంధు ఇచ్చేది టీఆర్ఎస్ సర్కారు. పంటకు అనుకున్న విధంగా గిట్టుబాటు ధర అందించాం. -త్వరలోనే ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి కాళేశ్వరం నీళ్లతో రైతు కాళ్లు కడుగుతాం.
  • – దుబ్బాక నియోజక వర్గంలో 57వేల మందికి పింఛన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
  • – ఇతర పార్టీల నేతలు డబ్బాల్లో రాళ్లు వేసి ఉపేది, ఊపుతున్నారు.
  • – నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారు, కానీ నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టుగా తెలంగాణ సర్కారు పని చేస్తుంది.
  • – ఇప్పటిదాకా 7లక్షల మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ కింద 5555 కోట్ల రూపాయలు అందించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్‌దే.
- Advertisement -