బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్- ఈటెల

140
etela
- Advertisement -

మంగళవారం తెలంగాణ భవన్‌లో బీసీ సంఘాలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు,మంత్రి ఈటల రాజేందర్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీసీలు,ఎంబీసీల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఏకైక సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఆవరణలో మూడు రోజులు కొన్ని గంటల పాటూ బీసీల సమస్యలపై చర్చించి సీఎంకు నివేదిక ఇచ్చాము. ఆ నివేదిక ఆధారంగా నిర్ణయాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.

119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి అట్టడుగు వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఏ పార్టీ చిత్తశుద్ధితో బీసీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుందో అందరికీ తెలుసు. మాటలు చెప్పం,చేసి చూపిస్తున్నామని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ సంఘాలు టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -