కరోనా వ్యాక్సిన్ ముందుగా తెలంగాణ ప్రజలకివ్వాలి:ఈటల

163
etela
- Advertisement -

భారత్ బయోటెక్ లో తయారవుతున్న వ్యాక్సిన్ ను ముందుగా తెలంగాణ ప్రజలకి ఇవ్వాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం గర్వకారణం అన్నారు.

తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి ఆ ఫలితం  ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీ డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని వాక్సిన్ డోస్ లు ఇవ్వాలని కోరుతున్నాం. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాబట్టి  ప్రజలందరికీ అతిత్వరలో వాక్సిన్ అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ నీ కోరుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

- Advertisement -