తిరుపతి తరహాలో యాదాద్రి: ఎర్రబెల్లి

56
errabelli
- Advertisement -

సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నూతన సంవత్సరం సందర్భంగా సతీసమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు ఎర్రబెల్లి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తిరుపతితో సమానంగా యాదాద్రి ఆలయం అభివృద్ధి జరిగిందని, ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభాలు జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.కేంద్రం సహకరించకపోయినా భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుందని తెలిపారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సీఎం బాగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ ప్రజలకు ఎనిమిదేండ్ల నుంచి శుభం జరుగుతుందని అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -