ఎంజీఎంను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి..

130
errabelli
- Advertisement -

వరంగల్ ఎంజీఎంలో కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో మరణమృదంగంపై స్పందించిన మంత్రి…. హుటాహుటిన ఎంజీఎంకు చేరుకున్నారు. ఆస్పత్రిలో పర్యటిస్తూ కరోనా రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. క‌రోన బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి నిరంతరం ముందుండి ప‌నిచేస్తున్న‌యం.జి.యం ఆసుప‌త్రి సూప‌రిండెంట్ నాగార్జున‌రెడ్డిని, డాక్ట‌ర్ల‌ను,పారా మెడిక‌ల్, పారిశుద్య‌ సిబ్బందిని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అభినందించారు.

గత 24 గంటల్లో ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో 27 మంది రోగులు ప్రాణాలు వదిలారు. కోవిడ్ వార్డు ఇప్పటికే రోగులతో కిక్కిరిసిపోగా మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -