జర్నలిస్టు శ్రీధర్ మృతి బాధాకరం: హరీశ్ రావు

115
harish
- Advertisement -

సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన హరీశ్…. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అందించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టు మిత్రులు సురక్షితంగా ఉండాలని సూచించారు.

మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో శ్రీధర్ చురుకైన పాత్ర పోషించారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు అని అన్నారు. మిత్రుడి శ్రీధర్ బాబు ధర్మాసనం మరణం బాధాకరం అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఫోరమ్‌తో కలిసి ప్రయాణం చేసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీధర్ మరణం తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కే కాదు తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు.

- Advertisement -