భ‌య‌ప‌డ‌కండి … అండ‌గా నేనున్నా: ఎర్రబెల్లి

153
errabelli
- Advertisement -

హోం క్వారంటైన్ ల‌లో ఉన్న క‌రోనా బాధ‌తులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆధికారులతో టెలీ కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. క‌రోనాతో భ‌య‌ప‌డ‌కండి… మీకు అండ‌గా నేనున్నాను. ధైర్యంగా ఉందాం.. క‌రోనాని ఎదుర్కొందాం… మీరెట్టి ప‌రిస్థితుల్లోనూ ఆందోళ‌న చెందొద్దు. మ‌రీ స‌మ‌స్య‌గా ఉంటే నాకు గానీ, నా సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. 24 గంట‌లూ అందుబాటులో ఉంటాం. అంద‌రినీ ఆదుకుంటామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు బాధితులకు భరోసాని, ధైర్యాన్నినింపుతూ ఇంకోవైపు ప్రజాప్రతినిధులు వారి అందుకోవాలని చెపుతూ వారితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి మంగ‌ళ‌‌వారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు,సీఐ లు,ఎస్సైలు, డీఎం& హెచ్ఓ,డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కాగా, వారిలో అనేక మంది మంత్రి తోనూ మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా తీవ్రత తగ్గిందన్నారు. సీఎం కెసిఆర్, మంత్ర‌లు కెటిఆర్, ఈట‌ల‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వ‌ల్ల మ‌న రాష్ట్రంలో వైర‌స్ అదుపులోనే ఉంద‌న్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడంతోపాటు, తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ఇక కరోనా వచ్చిన వారు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం సాయంగా ఉందని, ఎంజిఎం సహా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలతోపాటు తగు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. కాగా, కరోనా బాధివ‌తుల‌కు స‌దుపాయం కోసం తొర్రూరు, రాయ‌ప‌ర్తి, పెద్ద‌వంగ‌ర మండ‌లాల‌కు అందుబాటులో ఉండే విధంగా తొర్రూరులో ఒక అంబులెన్స్ వాహ‌నం, కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల‌, పాల‌కుర్తి మండ‌లాలకు అందుబాటులో ఉండే విధంగా ఒక అంబులెన్స్ వాహ‌నాన్ని పాల‌కుర్తిలో ఈ రోజే ప్రారంభించామ‌న్నారు. క‌రోనా బాధితులు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా ఆహారం తీసుకోవాలన్నారు.

- Advertisement -