కందికొండ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం- ఎర్రబెల్లి

49
- Advertisement -

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చివరి చూపు నిమిత్తం తెలంగాణ ఫిలిం చాంబర్ లో కందికొండ మృతదేహాన్ని పెట్టారు. కందికొండ పార్థివ దేహాంపై మంత్రి ఎర్రబెల్లి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

- Advertisement -