మిషన్ భగీరథ వాటర్‌ బాటిల్‌ను ఆవిష్కరించిన మంత్రి..

147
Minister Errabelli Dayakar
- Advertisement -

మిషన్ భగీరథ మంచినీరు అచ్చమైన స్వచ్ఛమైన జలం అని ఈ మంచి నీటితో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నదుల భూ ఉపరితలంపై నుండి వస్తున్న శుద్ధిచేసిన మిషన్ భగీరథ మంచినీరులో అన్ని రకాల లవణాలు సమపాళ్ళల్లో ఉంటాయని మంత్రి తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ వాటర్‌ బాటిల్‌ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మిషన్ భగీరథ మంచినీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం దివ్యమైన నీరుగా గుర్తింపు దక్కిందన్నారు. ఈ నీటిని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తుందని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ వాటర్‌ బాటిల్‌ను కూడా సరఫరా చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ముందుగా అన్ని ప్రభుత్వ అ కార్యాలయాల్లో ఈ మంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు పరి శుభ్రమైన మిషన్ భగీరథ మంచి నీటిని వినియోగించాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సి ఈ శ్రీనివాసరావు, ఎస్ ఇ రాములు ఈఈ లు మల్లేశం, రామాంజనేయులు, ఓ ఎస్ డీ శ్రీనివాసరావు, ఏపీఎస్ కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -