సంగెంలో రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి…

151
errabelli
- Advertisement -

రైతులను సంఘటితం చేసేందుకే ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టిందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంగెం మండలంలోని తీగరాజుపల్లి, గావిచెర్ల గ్రామాల్లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు….తాము పండించిన పంటను గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటాయో రైతులంతా కలిసి చర్చించుకునేందుకు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. దీంతో పాటు వ్యవసాయ సంబంధ విషయాలు చర్చించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -