అన్నిరంగాల్లో వరంగల్ అభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి

167
aai
- Advertisement -

హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మామునూర్ ఎయిర్ పోర్టు స్థలాన్ని ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి,ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి సందర్శించారు.

ఈ సంద్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి …. విమానాశ్రయ ఏర్పాటు కోసం ఏర్పాటు కోసం 1140 ఎకరాల స్థలం కావాలని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారన్నారు. 700 ఎకరాల స్థలం ఉండగా మరో 200 ఎకరాల స్థలం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భూ స్వభావ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

- Advertisement -