20 రోజుల పాటు అసెంబ్లీ,మండలి సమావేశాలు…

215
gutha
- Advertisement -

20 రోజుల పాటు అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. హైదరాబాద్…తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన గుత్తా… ఈ సారి 4 బిల్లులు సభకు వచ్చే అవకాశం ఉంది
న్నారు.

కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశాలు జరుగుతాయని…థర్మల్ స్క్రినింగ్ ఏర్పాటు–మాస్క్ అండ్ టెంపరేచర్‌ చెప్పే యంత్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. సోషల్ డిస్టెన్స్ ఉండే విధంగా సీట్లను ఏర్పాటు చేశాం….కొత్తగా 8 సీట్లను మండలి లో ఏర్పాటు చేశాం అన్నారు.ప్రెస్ గ్యాలరీ తో పాటు విసిటర్స్ గ్యాలరీ లో సోషల్ డిస్టన్స్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం …రెవెన్యూ చట్టాన్ని సభలో తేవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు.

పీవీ నరసింహారావుని మూడు- నాలుగు సార్లు కలిశాను….పివి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కలిశానని తెలిపారు. గుత్తా మోహన్ రెడ్డి భూమి 17 గుంటలు పిలాయి పల్లి కెనాల్ పోతుంది…నర్సింహారెడ్డి- మోహన్ రెడ్డి- మరొకరిది భూమి పోతుంది..ఎకరాల భూమి కెనాల్ లో పోయినా గొడవ లేదు-17 గుంటల దగ్గర గొడవ జరిగింది…చిన్న విషయం పెద్దగా మారిందన్నారు.

కృష్ణ వాటర్ పై టి- సర్కార్ న్యాయపరంగా వెళ్తుంది…కృష్ణ నీళ్లను అక్రమంగా ఏపీ ప్రభుత్వం తీసుకుపోతా అంటే ఒప్పుకునేది లేదు…పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అనేది అక్రమ ప్రాజెక్టు దానికి అదనంగా రాయలసీమ లెఫ్ట్ అనేది తప్పు…పోతిరెడ్డిపాడు అంశంపైన అప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ నేను-జానారెడ్డి ప్రభుత్వానికి లెటర్స్ రాసాము ..అప్పటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంత మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడలేదు…టీడీపీ ప్రభుత్వం హయాంలో దేవాదుల ప్రాజెక్టు దగ్గర వివాదం జరిగింది…రీ-డిజైన్ ప్రాజెక్టులన్నీ గోదావరిపైజరిగాయని తెలిపారు.

తెలంగాణకు ఎన్ని నీళ్లు తేవాలన్నా లిఫ్ట్ ల ద్వారా మాత్రమే తేవాల్సి ఉంటుంది..కృష్ణ పై తెలంగాణ-ఏపీ-కర్ణాటక-మహారాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నాయి…శ్రీశైలం విద్యుత్ సంఘటన పై విమర్శలు కరెక్ట్ కాదు…జరిగిన సంఘటన అనేది మానవ తప్పిదామా? ఇతర కారణాల అనేది విచారణ జరుగుతుంది…శ్రీశైల విద్యుత్ అనేది తెలంగాణ జీవనాడి లాంటిది…ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏ భాద్యత అప్పగిస్తే అది నిర్వర్తిస్తా…తనకు నాకు వచ్చిన రాజ్యాంగ పదవిలో సంతృప్తి గా ఉన్నా…కేసీఆర్ ఉద్యమ కారులకు అన్యాయం చెయ్యరు అనేది నా నమ్మకం…రాజకీయ సమీకరణలో ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడం తప్పదు..కేటీఆర్ అన్ని పదవులకు సమర్దుడేనని తెలిపారు.

- Advertisement -