బాలుడి కిడ్నాప్, హత్య సంఘటనపై మంత్రి విచారం..

229
minister errabelli
- Advertisement -

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య సంఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆ సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహబూబాబాద్ సంఘటన చాలా బాధాకరం. దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.దగ్గరి వారే కిడ్నాప్ చేసి చంపడం మరింత హృదయ విదారకరం. ఆ బాలుడి తల్లిదండ్రుల కడుపు కోతకు అంతులేదు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ఎస్పీని ఆదేశించానని అన్నారు. ఆ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియచేస్తున్నాను. సమాజంలో ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.

- Advertisement -