మిషన్ కాకతీయతో పూర్వవైభవం: ఎర్రబెల్లి

91
errabelli
- Advertisement -

మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువులకు పున‌ర్‌వైభ‌వం తీసుకొచ్చామ‌న్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని పెద్ద చెరువులో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంగ‌ళ‌వారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రహరీ గోడను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… మ‌త్స్య‌కారుల సంక్షేమ‌మే సీఎం కేసీఆర్ ధ్యేయ‌మ‌న్నారు. చెరువులపై ఆధారపడ్డ కులాలకు, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. చేప పిల్ల‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ముదిరాజ్ లకు చెరువులపై హక్కులు కల్పించి ఆ కులాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు.

- Advertisement -