చాముండేశ్వ‌రిని అభినందించిన మంత్రి అల్లోల..

163
Minister Allola
- Advertisement -

భార‌త‌ వాయుసేన అధికారిణిగా ఎంపికై చరిత్ర సృష్టించిన తొలి గురుకుల విద్యార్థిని చాముండేశ్వ‌రి దేవిని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభినందించారు. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణానికి చెందిన చాముండేశ్వ‌రి దేవి త‌ల్లిదండ్రులు గోపు విజ‌య‌కుమార్- శార‌దతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి అల్లోల వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. విద్యార్థిని చాముండేశ్వ‌రితో మా‌ట్లాడిన మంత్రి మ‌రిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ట్రానికి మంచి గుర్తింపును, గౌరవాన్ని తేవాలన్నారు.ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ఉత్త‌మ ర్యాంకు సాధించి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు వ‌న్నె తెచ్చావ‌ని మంత్రి కొనియాడారు.

- Advertisement -