రాష్ట్రంలో కొత్తగా 2,251 కరోనా కేసులు..

269
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,251 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఈమేరకు వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వెల్లడించింది..ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసులు 3,29,529కి చేరుకోగా… 3,05,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,765 మంది మృతి చెందారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 355 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా (258), నిజామాబాద్ జిల్లా (244) ఉన్నాయి. ములుగు జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉంది. దేశ రికవరీ రేటు 89.9 శాతం కావడం గమనార్హం.

- Advertisement -