మైఖేల్ ఓటీటీలోకి ఎప్పుడంటే…

33
- Advertisement -

కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్నమైన పాత్రలు వేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సందీప్ కిషన్. కానీ రావాల్సిన గుర్తింపు రావడం లేదు. మాస్ ఇమేజ్‌ కోసం కమర్షియల్ సినిమాలు తీసినా ఉపయోగం లేకుండా పోతుంది. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ సాధించాలని మైఖేల్ వంటి పాన్ ఇండియా సినిమా చేశారు. అయితే అనుకున్నంతగా ఆడలేకపోయినా మైఖేల్‌ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మూవీ మేకర్స్ విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్‌ పెద్దగా ఉపయోగపడలేదని చెప్పొచ్చు.

విజయ్‌ సేతుపతి, గౌతమ్ మీనన్‌, వరుణ్‌సందేశ్ లాంటి స్టార్స్‌ ఉన్న ఈ సినిమా అంతగా హిట్‌ కాలేకపోయింది. రైటర్ పద్మభూషణ్‌ సినిమాకు గట్టిపోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీంతో విడుదలైన అతికొద్ది కాలానికే ఓటీటీలోకి రాబోతున్న సినిమాగా నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మైఖేల్ సినిమాను ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు వెల్లడించింది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్‌కు జోడీగా దివ్యాంశకౌశిక్‌ నటించింది.

ఇవి కూడా చదవండి…

భోళా శంకర్‌లో రీమేక్ సాంగ్‌…

బాలయ్య కొత్త షెడ్యూల్ ఖరారు

ఓ తండ్రిగా గర్వపడుతున్నా..

- Advertisement -