ఓటేసిన మెగాస్టార్..

185
chiru
- Advertisement -

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఓటు వేసేందుకు ఉదయం నుండే బారులు తీరారు ఓటర్లు. నాంపల్లిలో సీపీ సజ్జనార్ ఓటు హక్కు వినియోగించుకోగా జూబ్లీక్లబ్‌లో మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాస్త్రీపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుందన్‌బాగ్‌లో ఓటేసిన మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చి ఓటేశారు మంత్రి కేటీఆర్‌. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలి…అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని నగర అభివృద్ధిలో భాగస్వాములుకావాలని కోరారు.

- Advertisement -