నోముల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి…

219
kcr
- Advertisement -

టీఆర్ఎస్ నేత,నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పనిచేసిన గొప్ప నేత నోముల అని కొనియాడారు. ఆయన మృతి పార్టీకే కాదు నాగార్జునసాగర్ ప్రజలకు తీరని లోటన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే నోముల న‌ర్సింహయ్య మృతి ప‌ట్ల‌ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంతాపం వ్య‌క్తంచేశారు. న‌ల్గొండ జిల్లా ఒక మంచి నిస్వార్థ రాజ‌కీయ నాయకుడిని కోల్పోయింద‌ని ….ప్ర‌జ‌ల కోసమే త‌న జీవితాన్ని అంకితం చేసిన న‌ర్సింహ‌య్య లోటును ఎవ‌రు తీర్చ‌లేర‌న్నారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -