వైకాపా పతనాన్ని త్వరలో చూస్తాము…

55
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని సినీ హీరో నాగబాబు మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి యువత రావడంలేదని అన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే నియంతలా లాంటి వ్యక్తులు ఇంటిదారి పడతారని అన్నారు. జనసేన పార్టీ యువతకే పెద్దపీట వేస్తోందని సూచించారు. ఈ పార్టీ అభివృద్ధి కోసమే అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ప్రతిపక్షాలను ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. వైకాపా పతానాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రజల వెనుకబాటుకు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.

జనసేన పార్టీ ఏర్పాటు చేసిన శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమాన్నికి రాష్ట్రం నలూమూలల నుంచి జనసైనికులు పవన్ అభిమానులు వచ్చారు. దీంతో సభా ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. నేటి యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ఏపీ సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ..

పవన్ బిజీపీతో కటిఫ్.. ఎవరికి నష్టం !

ఈనెల 18న కంటి వెలుగు….

- Advertisement -