‘నేను మాస్కు ధరించాను.. మరి మీరు?’- మహేష్‌

291
mahesh babu
- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు తాను మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేస్తూ, అందరూ మాస్కులు ధరించాలని సూచన చేశాడు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సడలింపులతో క్రమంగా అన్నీ తెరుచుకుంటున్నాయని మహేష్‌ గుర్తు చేశాడు. ఇటువంటి సమయంలో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. బయటకు వెళ్లిన ప్రతిసారి మాస్కులు ధరించాలని ఆయన సూచించాడు.

అయితే మాస్క్‌ ధరించడం వల్ల మనతో పాటు ఇతరులను రక్షిస్తున్న వారమవుతామని చెప్పాడు. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. జీవితం మళ్లీ సాధారణ పరిస్థితులకు వెళ్తోందని మహేష్‌ అన్నాడు. ఇటువంటి సమయంలో మాస్కులు ధరించడం చాలా మంచిదని చెప్పాడు. ‘నేను మాస్కు ధరించాను.. మరి మీరు?’ అంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. కాగా మహేష్ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. తదుపరి చిత్రం దర్శకుడు పరశురాంతో చేయనున్నారు.

- Advertisement -