కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడుదల చేశారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ కమలేషన్ కశ్యప్ దృవీకరించారు. గత ఐదు రోజులుగా మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల గురువారం విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడిచిపెట్టారు. కొద్దిసేపట్లో రాకేశ్వర్ బెటాలియన్ వద్దకు చేరుకోనున్నాడు.
బీజాపూర్ జిల్లా తర్రెం ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టులు సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్ను ఎత్తుకెళ్లి పోయిన సంగతి తెలిసిందే. చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని ప్రభుత్వానికి మావోయిస్టులు అవకాశం ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాక ముందే మావోయిస్టులు రాకేశ్వర్సింగ్ విడుదల చేయడం ఆసక్తిగా మారింది. జవాన్ విడుదలను బీజాపూర్ ఎస్పీ కమలేషన్ కశ్యప్ స్పష్టం చేశారు. మా పోలీసుల సంరక్షణలో రాకేశ్వరర్ ఉన్నాడని ఎస్పీ తెలిపారు.