విశాఖలో ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టు నేత మృతి..

133
- Advertisement -

విశాఖ అడవుల్లో ఈరోజు గ్రౌహౌండ్స్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ కొయ్యూరు మండలం తీగలం మెట్ట అటవీ ప్రాంతంలో జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య ప్రాణాలు కోల్పోయారు. డీసీఎం (డిప్యూటీ కమాండర్ ఫర్ మెయింటెనెన్స్)గా గంగయ్య కొనసాగుతున్నారు.

ఈ ఎన్‌కౌంటర్ దట్టమైన అటవీ ప్రాంతంలో చోటు చేసుకోవడంతో… పూర్తి వివరాలు వెల్లడి అయ్యేందుకు సమయం పడుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ నుంచి కొందరు కీలక మావో నేతలు తప్పించుకున్నట్టు సమాచారం. తప్పించుకున్న మావోల కోసం హెలికాప్టర్ సాయంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

- Advertisement -