స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాట రాసిన దీదీ..

166
Mamata Banerjee
- Advertisement -

ఈ రోజు బెంగాల్‌లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ పాట రాశారు. ‘ఈ దేశం మనందరిదీ’ అంటూ సాగే ఆ పాటను ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. బెంగాలీ గాయకులు ఇంద్రనీల్ సేన్, మనోమయ్ భట్టాచార్య, త్రిష పరూయి, దేవజ్యోతి ఘోష్ లు తాను రాసిన ఆ పాటను పాడినట్టు పేర్కొన్నారు.మన స్వాతంత్ర్యాన్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్న అన్ని దుష్ట శక్తులపై పోరాడేందుకు గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని మమత ఈరోజు ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగాలను చేసిన మహనీయులను ఎన్నటికీ మరిచిపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -