మొక్కలు నాటిన మలక్‌పేట్ జిహెచ్ఎంసి డీసీ..

144
Malakpet GHMC DC
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మలక్ పేట్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మరొక ముగ్గురిని 1) మున్సిపల్‌ కమిషనర్, కొత్తకోట 2) మున్సిపల్‌ కమిషనర్, బెల్లంపల్లి 3) డిప్యూటీ కమిషనర్, సంతోష్‌నగర్‌ లకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -