మేజర్‌ను అభినందించిన మాజీ రాష్ట్రపతి ఆర్ఎన్ కోవింద్

37
- Advertisement -

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘మేజర్’ హ్యూజ్  బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది.

ఇదిలావుండగా హీరో అడివి శేష్, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీ నుంచి ఆహ్వానం అందుకున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ ను రూపొందించినందుకు అడివి శేష్‌ ని అభినందించారు శ్రీ రామ్ నాథ్ కోవింద్. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు అభినందించి, ఆశీర్వదించారు. ఇది మేకర్స్‌ కి అతిపెద్ద విజయం, గర్వకారణమైన క్షణం.

Also Read: PriyankaChopra:నేను ఇంకా ఆ సినిమా చూడలేదు

మేజర్ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జీయంబీ ఎంటర్‌ టైన్‌ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , A+S మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.  మేజర్‌ లో శాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి , మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Also Read: మహేష్ ఫ్యాన్స్ కి శుభవార్త

- Advertisement -