మహేష్ ఫ్యాన్స్ కి శుభవార్త

34
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ తప్ప.. అంతకు మించి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు యూనిట్. దీనికితోడు ఈ చిత్ర షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా, ఈ చిత్రం షెడ్యూల్‌ జూన్ మొదటి వారంలో అనగా జూన్ 4వ తేదీ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ షూట్ లో మహేష్ తో పాటు పూజా హెగ్డే కూడా జాయిన్ కానుంది. ముందుగా వీరి ఇద్దరి పై ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తారు.

అనంతరం ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట. అన్నట్టు మే 31న SSMB28 ఫస్ట్‌ గ్లింప్స్‌ తో పాటు టైటిల్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ బ్యాక్ టూ బ్యాక్ అప్‌డేట్స్‌తో మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. అందుకు అనుగుణంగానే వరుసపెట్టి అప్ డేట్స్ ఇచ్చేందుకు సితార ఎంటర్ టైన్మెంట్స్ కూడా ఇప్పటికే సమాయత్తం అవుతుంది. ఇక ఇంతకుముందు మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో అతడు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. కానీ, ఖలేజా బాగా నిరాశ పరిచింది.

Also Read: PriyankaChopra:నేను ఇంకా ఆ సినిమా చూడలేదు

మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరూ కలిశారు. ఈసారి పాన్ ఇండియా సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ సినిమాలో సంజయ్ దత్ ను తీసుకోబోతున్నాడు. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుంది. ఇక సెకండ్ లీడ్ లో శ్రీలీల ను తీసుకున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమా బెటర్ అవుట్ ఫుట్ కోసం బాగా కష్ట పడుతున్నాడు. అందుకే ఇప్పటికే జరిగిన కొన్ని సీన్స్ ను కూడా పక్కన పెట్టాడు.

Also Read: నేను సెలెక్టివ్ గా చిత్రాలు చేయడం లేదు : మిక్కీ

- Advertisement -