అలనాటి మోసగాళ్లకు మోసగాడు స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. నాటి తారలైన ఎన్నాఆర్ ఎన్టీఆర్ కృష్ణ కృష్ణంరాజు శోభన్బాబు లాంటి దిగ్గజాలు మరణంతో తీవ్రవిషాదంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా మహేష్కు తీరని శోకంలో మునిగిపోయారు. ఇదే యేడాదిలో మహేష్ ఫ్యామిలీలో తల్లి ఇందిరాదేవి, అన్న రమేష్బాబు మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కృష్ణ మృతితో మహేష్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు.
మహేష్ ఇంట్లో ఒంటరిగా ఉంటే మరింత దుఃఖంలోకి వెళ్తాడని త్రివిక్రమ్ భావించి షూటింగ్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. మహేష్ నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించి సమయం దొరికినప్పుడల్లా మహేష్తో మాట్లాడుతున్నాడట. ఇలా మహేష్ను విషాదం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తున్నాడు
త్రివిక్రమ్ అనుకున్న సమయానికంటే ఎక్కువగా ఈ సినిమాకు బ్రేక్ వచ్చిందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే అన్నీ అనుకున్నట్లు కుదిరితే, డిసెంబర్ మొదటి వారంలోనే మహేష్తో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. మరి మహేష్ నిజంగానే షూటింగ్లో జాయిన్ అవుతాడా లేడా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి…