మహేష్..మహర్షి షూటింగ్ పూర్తి..!

296
mahesh babu
- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్‌లో అమెరికా వెళ్లిన చిత్ర యూనిట్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు
చేస్తోంది.

మహేశ్ కి ఇది 25వ సినిమా కావడంతో వంశీ పైడిపల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. డెహ్రాడూన్, గోవాలో కూడా చిత్ర షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌,మహేష్ లుక్‌ అందరిని ఆకట్టుకుంది. మహేష్ తల్లిగా సీనియర్ నటి జయప్రద నటించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

రైతు క‌థాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌ లో కనిపించనున్నాడు.

- Advertisement -