‘సవ్యసాచి’లో ఆకట్టుకుంటున్న రీమేక్ సాంగ్..

319
- Advertisement -

చందూ మొండేటి, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ వస్తున్న తాజా చిత్రం “సవ్యసాచి”. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తుంది మూవీ యూనిట్. ఈ క్రమంలో చిత్రంలోని కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. “ప్రేమమ్” అనంతరం చందూ, చైతూ కలిసి చేస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.తాజాగా సవ్యసాచి చిత్రంలో నాగ చైతన్య తన తండ్రి నాగార్జున నటించిన “అల్లరి అల్లుడు” సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “నిన్ను రోడ్డు మీద చూసినట్లు లగాయత్తు” అనే రీమేక్ పాటలో అలరించాడు. నాగ్, రమ్యకృష్ణ జంటగా 1993 ఏడాదిలో వచ్చిన అల్లరి అల్లుడు సినిమాలోని ఈ పాట యువతను ఉర్రూగలూగించింది. అప్పట్లో కీరవాణి సంగీతంలో రూపొందించిన ఈ సాంగ్ ఇప్పుడు “సవ్యసాచి” చిత్రం కోసం మరోసారి ఈ పాటను కీరవాణి రీమేక్ చేశారు. పృధ్వీ చంద్ర, మౌనిమ పాడిన ఈ పాటకు చైతన్య, నిధి అగర్వాల్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. మాధవన్, భూమికలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -