Mahesh:’గుంటూరు కారం’ పాన్ ఇండియా రిలీజ్?

41
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ బాక్సాఫీస్ ఏ స్థాయిలో మంట పెట్టిందో తెలిసిందే. ఇక దీపావళి నుంచి ప్రమోషన్స్ షురూ చేసిన ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ లిరికల్ సాంగ్ ధమ్ మసాలా ” సాంగ్ అభిమానులకు ఫుల్ మాస్ ఫీస్ట్ ను అందించింది. ఈ మూవీలో మహేష్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో చూస్తారని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాయి. అదే విధంగా గుంటూరుకారం మూవీలో కూడా మహేష్ బాబును మరో డిఫరెంట్ రోల్ లో చూపించబోతున్నాడట త్రివిక్రమ్..

ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. మొదట ఈ మూవీని తెలుగు వరకే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎందుకంటే నార్త్ లో మాస్ మూవీస్ కు ఫుల్ డిమాండ్ ఉండడంతో గుంటూరు కారం మూవీ కూడా పక్కా మాస్ మసాలా మూవీ కావడంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడమే మంచిదని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికి పాన్ ఇండియా రిలీజ్ పై త్వరలోనే మేకర్స్ నిర్ణయం తీసుకొనున్నారట. ఆల్రెడీ మహేష్ బాబుకు అటు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఇప్పుడు అధికారికంగా గుంటూరు కారం మూవీతో పాన్ ఇండియా లోకి అడుగు పెడితే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని అభిమానులు చెబుతున్నారు.

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -