‘కోటి వృక్షార్చన’కు అందరూ అండగా ఉండాలి- మహేష్‌ బాబు‌

146
mahesh
- Advertisement -

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఒక ఉద్యమంలా ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి ప్రజలందరూ అండగా ఉండాలని సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు పిలుపునిచ్చారు.

ఆదివారం ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌చేశారు. ఇందులో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ గీతం నేపథ్యంలో మహేశ్‌బాబుతోపాటు ఆయన పిల్లలు గౌతమ్‌, సితార మొక్కలు నాటుతూ కనిపిస్తున్నారు. భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) తగ్గించాలి అంటే మొక్కలు నాటడం, చెట్లు పెంచడమే పరిష్కారం అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు.

- Advertisement -