సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టాలి: మ‌ంత్రి అల్లోల

121
minister allola
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు. ఆదివారం నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తల కోసం బీమా సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి ​అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకూ రూ.2లక్షల బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్త సభ్యత్వం నమోదు చేసుకోవడంతో పాటు, గ్రామస్తులను పార్టీ సభ్యులుగా చేర్చి సభ్యత్వాన్ని పొందేలా చూడాలన్నారు. లక్ష్యానికి కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని కార్యకర్తలను కోరారు. సభ్యత్వం నమోదులో రాష్ట్రంలోనే నిర్మ‌ల్‌ను మొదటి స్థానంలోకి తీసుకురావాలన్నారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

- Advertisement -