మహేశ్‌ బాబు @ 41

197
mahesh
- Advertisement -

తెలుగు తెర రాకుమారుడు … పడుచుపిల్లల మనసు దోచే గ్రీకువీరుడు . అదరక బదులే చెప్పేటి నిప్పుకణం అతడు. భారీ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బిజినెస్ మ్యాన్. చిరునవ్వుతోనే బ్రహ్మోత్సవం చేసే శ్రీమంతుడు. రాజకుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పోకిరిగా హల్ చల్ చేసి..అభిమానులకు గుండెల్లో మురారిగా మారి స్పైడర్‌గా చెరగని ముద్రవేసుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు 1979లో ‘నీడ’ సినిమాతో మహేష్ బాబుని బాలనటుడిగా పరిచయం చేశారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా తండ్రి కృష్ణతో, అన్నయ్య రమేష్ బాబుతో కలిసి పోరాటం , శంఖారావం,కొడుకు దిద్దిన కాపురం, గూడాఛారి 117,బజారురౌడీ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలనటుడిగా ద్విపాత్రాభినయం కూడా చేశారు.

దర్శకేంద్రుడు కె.రాఘవెంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్. ‘మురారి’, ‘ఒక్కడు’,‘అతడు’, ‘పోకిరి’, దూకుడు’ మరియు ‘బిజినెస్ మాన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తనఖాతాలో వేసుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ‘నాని’, ‘మురారి’ మరియు ‘నిజం’ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా తీసి మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పటివరకు ఏడు నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను సొంతం చేసుకున్నారు. తన స్మైల్ తోనే అందరిని కట్టి పడేసే మహేశ్..విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కొరుకుంటోంది.

- Advertisement -