“మహర్షి” కొత్త రికార్డు..

265
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మహర్షి. మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అదిరిపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ మరో రికార్డును సాధించింది. ఈ ట్రైలర్ ను విడుదల చేసిన కొద్ది సేపటికే 2మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. ట్రైలర్ బాగుడటంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

విడుదలైన కొద్ది గంటల్లోనే అన్ని వ్యూస్ ను సొంతం చేసుకున్న మహర్షి సినిమా విడుదలయ్యే లోపు మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి. ప్రపంచవ్యాప్తంగా మే9న ఈమూవీ విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు నిర్మించారు. మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈమూవీకి హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది.

- Advertisement -