సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మహర్షి. మహేశ్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీని మే9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసందర్భంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని పిపుల్స్ ప్లాజాలో ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేశ్, విజయ్ దేవరకొండ విచ్చేశారు. ఈసందర్భంగా నిన్న ఈసినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఏలేద్దాం అనుకుంటున్నా సార్!! ప్రపంచాన్ని ఏలేద్దాం.. అనుకుంటున్నా సార్.., ఓడిపోతాం అనే భయంతో ఆటలోకి దిగితే.. ఎప్పటికీ గెలవలేం’ అంటూ మహేష్ బాబు మహర్షి ట్రైలర్లో చెప్తున్న ఈ డైలాగ్స్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాయి.
#MaharshiTrailer | Mahesh Babu, Pooja Hegde, Allari Naresh | Vamshi Paidipally | DSP | 4K