ఎన్టీఆర్‌ కొడుకులే పార్టీ మారారు..

292
Maganti Gopinath setires Revanth Reddy
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి…టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపు..ఎన్టీఆర్‌ గురించి వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

టీడీపీ గురించి ప్రస్తావించిన మాగంటి గోపి.. అప్పట్లో టీడీపీ నన్నసలు పట్టించుకోలేదన్నారు. ఎనిమిది నెలల పాటు తనకు గన్ మెన్స్ ను కూడా ఇవ్వలేదని అన్నారు. ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లే పార్టీ మారారని ఈ సందర్బంగా మాగంటి రేవంత్ కు గుర్తుచేశారు.

‘ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?’ అంటూ మాగంటి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన రేవంత్.. రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, తనకు ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని, కనీసం ఆయనను దగ్గర్నుంచి చూడను కూడా చూడలేదని అన్నారు. ‘పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్ కు వెళ్లేటప్పుడు ముందుగా పెద్దమ్మగుడికి వెళ్లి ఆ తర్వాత ఛాంబర్ లో అడుగుపెట్టావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఛాంబర్ లో అడుగుపెట్టేవాడివ’ని మాగంటి గోపీనాథ్ ఎత్తిపొడిచారు.

దీనికి బదులుగా రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, ‘నువ్వు పార్టీ ఫిరాయించినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ నుంచే వెళ్లావా?’ అని అనగానే… మాగంటి సమాధానమిస్తూ, ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. దీనికి రేవంత్ తాను పెద్దమ్మగుడినుంచి బయల్దేరినా ఎన్టీఆర్ భవన్ కే వెళ్లానన్నారు. వీరిద్దరి సంభాషణ అక్కడున్న వారికి నవ్వు తెప్పించింది.

- Advertisement -