ఎన్టీఆర్ కథతో..బన్నీ సినిమా

221
Allu Arjun
- Advertisement -

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్‌ మూవీ రచయిత అయిన వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తాడనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాత కళ్యాణ్ రామ్‌ ప్రకటించడంతో..సినిమా కన్ఫామ్ అనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమోగానీ సినిమా డిస్కర్షన్ దశలో ఆగిపోయింది. ఎన్టీఆర్ వక్కంతం వంశీని కాదని త్రివిక్రమ్ లేదా బాబీని తెరపైకి తీసుకువచ్చాడు. దీంతో రచయిత వక్కంతం వంశీ..ఎన్టీఆర్‌ తో చేయాల్సిన సినిమా స్టోరీని మరో స్టార్ హీరో అల్లు అర్జున్‌కు చెప్పాడట. బన్నీకి ఈ కథ బాగా నచ్చడంతో బన్నీ వెంటనే సినిమాకు ఒప్పుకున్నాడట.

 Allu Arjun

ప్రస్తుతం హారీష్ శంకర్ దర్శకత్వంలోదువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్న బన్నీ ఈ సినిమా కంప్లీట్ కాగానే…వక్కంతం వంశీ మూవీని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉగాధికి సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వక్కంతం వంశీ కథకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు. వాస్తవానికి బన్నీ డీజే సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో ద్విభాష చిత్రం చేయాలని..కానీ బన్నీ మాత్రం లింగుస్వామి సినిమాను పక్కకు పెట్టి..ముందు వక్కంతం సినిమాను పట్టాలెక్కించాలనే ఉద్దేశంలో ఉన్నాడట. ఇంకా ఈసినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా..త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం. దీనికి ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్. ఇంతవరకు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమైన లగడపాటికి, కేవలం కథలు రాసుకోవడంతోనే కెరీర్ కొనసాగించిన వక్కంతంకు బన్నీ సినిమాతో ప్రమోషన్ వచ్చినట్లే లెక్క. మొత్తానికి ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను బన్నీ తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -