- Advertisement -
నడిఘర్ సంఘం ఎన్నికలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నడిగర్ సంఘం ఎన్నికలు చెల్లుబాటవుతాయంటూ మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. 2019లో నడిఘర్ సంఘానికి ఎన్నికలు జరుగగా హీరో విశాల్, నాజర్, హీరో కార్తీ ప్యానల్ విజయం సాధించారు.
అయితే దానికి ముందే ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని ఆరోపిస్తూ కొంతమంది సభ్యులు పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్నికలను నిలిపివేశారు. ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ పీడీ ఆదికేశవులు జూన్ 21న రిజిస్ట్రార్ ఉత్తర్వులను నిలిపివేసి జూన్ 23న ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చారు.
తర్వాత జస్టిస్ కె.కల్యాణసుందరం జనవరి 2020లో, జూన్ 23, 2019న జరిగిన ఎన్నికలను రద్దు చేయగా నడిగర్ సంఘం ఎన్నికల్లో విజేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్ధానం విశాల్ ప్యానల్కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
- Advertisement -