ఎల్బిస్టేడియంలో లైవ్ లెజెండ్స్ కాన్సర్ట్ షో జన సముద్రం తో నిండిపోయింది. ఈ కార్యకమానికి ముఖ్య అదితి గా తెలంగాణ గవర్నర్ తమిలిసాయి సౌదరరాజన్, IPS శిఖా గోయల్, IAS జయశ్ రంజన్, సింగర్ సునీతా మరియు పలురు సినీ గాయకులు వచ్చారు.
కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వారాల బాలుడు బాలసుబ్రమణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్పటికీ ఎప్పటికీ ఆ ముగ్గురు దేదీప్యమానంగా వెలిగే తారలు. ఈ ముగ్గురి అపురూప కలయికలో ఎల్బి స్టేడియంలో జరిగిన సంగీతం సంగ్రామంతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి వేరే వేరే రాష్ట్రాలనుంచి 20 మంది వాద్య బృందం పాల్గొన్నారు.
ఈ ముగ్గురు కలయికలో ఇండియా లోనే మొట్ట మొదటి సంగీతం లైవ్ కాన్ సర్ట్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.గవర్నర్ మాట్లాడుతూ.. నాకు ఈ పాటలు అంటే చాలా ఇష్టం నాకంటే మా నాన్నకి ఇంకా ఇష్టం ఏసుదాస్ సంగీతానికి దేవుడు ఇచ్చిన వరం, బాలు పాటలు ఏ గాత్రం లోనియనే చాలా బాగుంటాయి, చిత్ర గాత్రం మాత్రం గాన కోకిలా ఉటుంది అన్ని అన్నారు.