సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు..లగడపాటి

225
kcr
- Advertisement -

యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షనీయమని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొనియాడారు. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. ఆలయ అభివృద్ధి పనులు నిరాటంకంగా, దిగ్విజయంగా పూర్తికావాలని కోరుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆయన ఈ విధంగా స్పందించారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

kcr

యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది.

- Advertisement -