ప్రత్యక్ష రాజకీయాల్లోనే సోనియా:కుమారి సెల్జా

59
- Advertisement -

సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతారని చెప్పారు ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ కుమారి సెల్జా. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని మాత్రమే సోనియా గాంధీ చెప్పారని స్పష్టం చేశారు. అంతేతప్ప, రాజకీయాలకు దూరమవుతున్నట్టు ఆమె ఎక్కడా చెప్పలేదని వివరించారు.

ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఉద్దేశం సోనియాకు లేదని తెలిపారు. ప్లీనరీలో సోనియా మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ కు చరమగీతం పాడడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇన్నింగ్స్ అంటే ఆమె రాజకీయ ప్రస్థానం అయ్యుంటుందని, పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్టు పరోక్షంగా చెప్పారని కథనాలు వచ్చాయి. దీంతో సోనియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంకాగా దీనిపై వివరణ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -