తెలంగాణ ఇసుక విధానం బెస్ట్‌.. కేటీఆర్‌

265
ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఇసుక విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధారమైన, అసహ్యం పుట్టించే విమర్శలు చేస్తున్నా, కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ఇసుక విధానమే బెస్ట్ అని గుర్తించిందని ట్వీట్ ద్వారా తెలియజేశారు.

అంతేకాదు, తెలంగాణ ఇసుక విధానాన్నే ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కేంద్రం సూచిస్తోందని తెలిపారు. ఇసుక మైనింగ్ అంశంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొనడంపై మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు.

- Advertisement -