టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌..

496
ktr trs
- Advertisement -

మరికొద్ది రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల రాబోతున్న సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. నేడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ మాట్లాడనున్నారు.

ఇందులో భాగాంగా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రచార సరళి, వ్యూహాలపై అభ్యర్థులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది.

- Advertisement -