రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు..!

674
Rashmika Mandanna
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలుగుతోన్న రష్మిక మందన్నకు ఐటీ షాక్ తగిలింది. కర్ణాటకలోని ఆమె ఇంట్లో ఈ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే రష్మికా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ ఆ చిత్రాలకు భారీ పారితోషకం అందుకున్న ఆమె ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు అనుమానిస్తున్న అధికారులు, దాడులు జరిపి, రష్మిక ఆస్తిపాస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.

rashimika

కర్ణాటక, కొడుగు సమీపంలోని విరాజ్ పేటలో ఉన్న రష్మిక ఇంటితో పాటు, బెంగళూరులోని ఫ్లాట్, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందు రష్మిక కనీసం మేనేజర్‌ను కూడా ఆమె పట్టుకోలేదని, ఆమె నుంచి ఒక్కమారు కూడా జీఎస్టీ క్లయిమ్ రాలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఇటీవలే ఈ అమ్మడు సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబుకు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించింది.

- Advertisement -