KTR:కామారెడ్డిలో పరిశ్రమల ఏర్పాటు

51
- Advertisement -

కామారెడ్డి బిక్కనూరు రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్..అర్హూలైన వారందరికి పెన్షన్లు ఇస్తామన్నారు. కామారెడ్డిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలిపాన్నారు. ఏడాదిలోపే గోదావరి నీళ్లు తీసుకొచ్చి బిక్కనూరు గొంతు తడుపుతామన్నారు. దేశంలో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, వలసలతో ఆగమైన బ్రతుకులు ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో జరగని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే రూ.5 వేల పెన్షన్ వస్తుందన్నారు. అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని వెల్లడించారు.

తెలంగాణ వచ్చినప్పుడు పెన్షన్ల సంఖ్య 29 లక్షలు…ఇప్పుడు 46 లక్షలు అన్నారు.ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి గట్టి బుద్ది చెప్పాలన్నారు.కాంగ్రెస్ చెప్పే మార్పు కటిక చీకట్లు అన్నారు. కాంగ్రెస్ మార్పు అంటేనే ఎండిన చెరువులన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు, అరాచకం, ఎన్‌కౌంటర్ల తప్ప ఏమి లేవన్నారు. కామారెడ్డిలో ఏ పని కావాలన్న చేసిపెట్టే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు కేటీఆర్.సీఎం కేసీఆర్ భూములు గుంజుకోవడానికి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు రూ. 3 వేలు అందిస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం అందిస్తామని చెప్పారు. కొడంగల్‌లో చెల్లని రేవంత్…కామారెడ్డిలో చెల్లుతాడా ఆలోచించాలన్నారు.

Also Read:కొత్తిమీర రసం తాగితే ఎన్ని లాభాలో!

- Advertisement -